నిజామాబాద్: మాజీ ఎంపీ కేశిపల్లి గంగారెడ్డి పార్థివదేహం నిజామాబాద్లోని తన నివాసంలో కార్యకర్తల సందర్శనార్థం ఉంచారు. గంగారెడ్డి భౌతికకాయానికి టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు నివాళులర్పించారు. రేపు డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లి ఫామ్హౌజ్లో గంగారెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. గంగారెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్కు సీఎం కేసీఆర్ ఆదేశించారు