హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో టేకాఫ్ అయిన 15 నిమిషాలకే విమానాన్ని ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన గురువారం ఉదయం 6.30 గంటలకు చోటు చేసుకోగా.. ఇప్పటి వరకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇండిగో సిబ్బందిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.