న్యూఢిల్లి : రాజకీయవేత్తగా మారిన ప్రసిద్ధ తమిళ నటుడు, మక్కళ్ నీధి మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ నేడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యుపిఎ ఛైర్పర్సన్ సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశమేనని ఆయన చెప్పారు. నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్తో సమావేశమయ్యానని, నేడు సోనియాగాంధీతో సమావేశమయ్యానని ఆయన అన్నారు. ఈ సమావేశాలకు ఏమీ ప్రత్యేకత లేదని ఆయన చెప్పారు.