హైదరాబాద్: సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై వైద్యారోగ్యశాఖ మంత్రి డా. లక్ష్మారెడ్డి, విద్యుత్శాఖ మంత్రి జగదీష్రెడ్డి నేడు సమీక్ష చేపట్టారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారి, సూర్యాపేట కలెక్టర్ సురేంద్ర మోహన్, వైద్య విద్య సంచాలకులు డా. రమేష్రెడ్డి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా. బి. శివప్రసాద్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ వేణుగోపాల్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు స్పందిస్తూ.. సాధ్యమైనంత తొందరలో భూసేకరణ పూర్తి చేయాలని ఉన్నతాధికారును ఆదేశించారు. జులై 7వ తేదీలోగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అనుమతుల కోసం అవసరమైన అన్ని రకాల ప్రక్రియలను పూర్తి చేయాలన్నారు.