రంగారెడ్డి: జిల్లాలోని గండిపేట మండలం పిడంచెరువు గ్రామంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. గంధంగూడ, బైరాగిగూడ, రాజీవ్గృహకల్ప కాలనీల్లో సోదాలు నిర్వహించారు. మాదాపూర్ డీసీపీ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు ఇంటింటిని తనిఖీ చేశారు. 20 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 20 బైక్లు, మూడు ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు రౌడీషీటర్లను పోలీసులు అరెస్టు చేశారు.