ఆర్టీసీలో కొత్తగా 1600 బస్సులు, 234 మినీ బస్సులు ప్రవేశపెట్టునున్నట్లు మంత్రి మహేందర్రెడ్డి తెలిపారు. అలాగే ఆర్టీసీలో ఇంధన పొదుపు పాటించిన డ్రైవర్లకు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు మహేందర్రెడ్డి తెలిపారు. ప్రోత్సాహకాలను లీటరకు ఆరు రూపాయలు ఇస్తున్నామన్నారు. దీనికి లిమిట్ లేదని ఎంత ఇంధనం పొదుపు చేస్తే అంత ప్రోత్సాహకం ఇస్తామన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి మహేందర్రెడ్డి సమాధానం చెప్పారు.