న్యూఢిల్లీ: ఇండియాలో మొత్తం 23 నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్లు యూజీసీ వెల్లడించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా ఈ జాబితాను తయారు చేశాయి. యూజిసీ అనుమితి లేకుండానే 23 వర్సిటీలు పనిచేస్తున్నట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్లో తొమ్మిది, ఢిల్లీలో ఏడు ఫేక్ వర్సిటీలు ఉన్నట్లు యూజీసీ చెప్పింది. ఢిల్లీలో అత్యధికంగా ఫేక్ కాలేజీలు కూడా ఉన్నాయి. అందులో ఇంజినీరింగ్, టెక్నికల్ కోర్సులు అందిస్తున్న 66 కాలేజీలు ఉన్నట్లు తెలుస్తున్నది. తెలంగాణతో పాటు యూపీ, బెంగాల్, మహారాష్ట్రలో సుమారు 279 టెక్నికల్ ఇన్స్టిట్యూట్లకు అనుమతి లేదని యూజీసీ తేల్చింది. ఆమోదం లేని వర్సిటీల్లో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోరాదని ఇప్పటికే యూజీసీ హెచ్చరికలు జారీ చేసింది.