బెంగళూరు : కావేరీ జలాల వివాదానికి సంబంధించి కేంద్రంతో కానీ, సుప్రీంకోర్టుతో కానీ వివాదాస్పదంగా వ్యవహరించవద్దని జెడిఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ తన కుమారుడు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి సలహా ఇచ్చారు. సఖ్యతగా మెలగి సమస్య పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.