ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అగ్రిగోల్డ్‌ బాధితుల సొమ్ము ఇప్పిస్తాం: ఉత్తమ్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 25, 2018, 11:40 AM

తాము అధికారంలోకి రా గానే అగ్రిగోల్డ్‌ సంస్థ చేతి లో మోసపోయిన వారిని ఆదుకుంటామని, బాధితుల సొమ్ము ఇప్పిస్తా మని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలసి అగ్రిగోల్డ్‌ బాధితులతో ఆయన సమావేశమయ్యారు. అగ్రిగోల్డ్‌ బాధితులు తాము మోసపోయిన వైనాన్ని ఉత్తమ్‌కు వివరించారు.  బాధితులను ఆదుకోవడంలో టీఆర్‌ఎస్‌ విఫలమైందని,  తాము అధికారంలోకి వచ్చి అగ్రిగోల్డ్‌ బాధితుల సొమ్మును తిరిగి ఇప్పిస్తామని వారికి హామీ ఇచ్చారు. పొంగులేటి  మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వీరికి న్యాయం చేయకపోతే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. 


తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షణకుగాను కొత్తగా నియమితులైన ఏఐసీసీ కార్యదర్శులు అప్పుడే తమ పని ప్రారంభించారు. ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాసన్‌ కృష్ణన్, సలీం అహ్మద్, డీఎస్‌ బోసురాజులు సోమవారం హైదరాబాద్‌ రానున్నారు. దక్షిణ, ఉత్తర, మధ్య తెలంగాణ ఇన్‌చార్జులుగా పని విభజన చేసుకున్న వీరు గాంధీభవన్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆర్‌.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్కలతో పాటు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ, సంస్థాగత వ్యవహారాలు, పోలింగ్‌బూత్‌ స్థాయి కమిటీలు, శక్తి యాప్‌లో కార్యకర్తల నమోదు విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నారు. అదేవిధంగా గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం కోసం 100 రోజుల పార్టీ ప్రణాళికపై కూడా రాష్ట్ర నేతలతో వీరు చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. 


దానం నాగేందర్‌ తమ పార్టీ లో ఉన్నప్పుడు ఆయన ఓ భూకబ్జాదారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోపించారని.. అలాంటి వ్యక్తిని ఇప్పుడెలా టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని కాంగ్రెస్‌కు చెందిన బీసీ నేతలు ప్రశ్నించారు. ఆదివారం గాంధీభవన్‌లో మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్‌ యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మహేశ్‌గౌడ్‌ విలేకరులతో మాట్లాడారు. దానం భూకబ్జాదారుడైతే టీఆర్‌ఎస్‌లో ఎలా చేర్చుకున్నారో సమాధానం చెప్పాలని పొన్నం డిమాండ్‌ చేశా రు. రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్‌ను దానం నాగేందర్‌ విమర్శించడం సరైంది కాదని, బీసీలకు ఉన్నత పదవులిచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనన్నారు. టీఆర్‌ఎస్‌ బీసీలకు ఎంత బడ్జెట్‌ కేటాయించిందో.. అందు లో ఎంత ఖర్చు చేసిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అంజన్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. దానం కాంగ్రెస్‌ను వదిలి పోవడం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. దానం ఒక బచ్చా అని, ఆయన కాంగ్రెస్‌ను వీడటం వల్ల హైదరాబ బాద్‌లో పార్టీ బలం ఇంకా పెరుగుతుందని చెప్పారు. దానం అగ్రవర్ణాల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని మహేశ్‌గౌడ్‌ ఆరోపించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com