నేడు పరిశ్రమల, ఐటీ శాఖమంత్రి కే తారకరామారావు, భారీ నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావులు పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడకు వస్తున్నారు. రూ. 104.24కోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మిస్తున్న ఈ ఉమ్మడి కాలుష్య శుద్ధి కర్మాగారానికి వారు శంకుస్థాపన చేస్తున్నారు. పరిశ్రమల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నారు. జీరో డిశ్చార్జ్ కాలుష్యంతో ఈ ప్లాంట్ నడుస్తుంది.
పారిశ్రామికవాడలోని 45పరిశ్రమ లతో పాటు సమీపంలో ఉన్న చిన్న, మద్య తరహా పరిశ్రమల పారిశ్రామిక వ్యర్థ జలాలను ఈ పారిశ్రామికవా డలోని ఉమ్మడి కాలుష్యశుద్ధి కర్మాగారంలో శుద్ధి చేస్తా రు. కాలుష్య తీవ్రతను పూర్తిగా తగ్గించి సాధారణ నీటిని తయారు చేస్తారు. ఈ నీటిని పరిశ్రమల సాధారణ అవసరాలకు తిరిగి వినియోగిస్తారు. 75లక్షల లీటర్ల కెపాసి టీ కల్గిన ట్యాంకులు, ఈటీపీలో ఏర్పాటు చేస్తున్నారు.