హైదరాబాద్: రేపు సాయంత్రం 4 గంటలకు మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం సమావేశం కానుంది. పంచాయతీరాజ్ రిజర్వేషన్ల అంశంపై అదనపు అడ్వకేట్ జనరల్, అధికారులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చించనుంది. పంచాయతీరాజ్ సంస్థల్లో ప్రజాప్రతినిధుల ఎన్నికలకు కేటాయించే రిజర్వేషన్ 50 శాతం దాటొద్దని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అవసరమైన కసరత్తు చేసి, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కావాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు.