పంజాబ్లోని ముక్త్సార్ జిల్లాలో నేడు జరుగనున్న కిసాన్ కళ్యాణ్ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్పి) పెంచిన నేపథ్యంలో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పంజాబ్ రాష్ట్రంలోని రైతులు దేశ వ్యవసాయ రంగం అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని మోడీ ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని బిజెపి, శిరోమణి అకాలీదళ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.