రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంపై ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ ప్రశంసల వర్షం కురిపించారు. రైతులు తమ ప్రాథమిక ఆదాయాన్ని పెంచుకునేందుకు రైతుబంధు పథకం ఉపయోగపడుతుందన్నారు. ఇతర రాష్ర్టాలు కూడా రైతుబంధు పథకాన్ని అమలు చేయాలని సుబ్రమణ్యన్ సూచించారు. దేశవ్యాప్తంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రైతాంగానికి రైతుబంధు పథకం పెద్ద ఊరట కలిగిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా రైతుబంధు పథకం అమలు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని అరవింద్ సుబ్రమణ్యన్ కోరారు. తక్కువ సమయంలో రైతుబంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసిందని కొనియాడారు. సామాజిక, వ్యవసాయ, ఆర్థిక ప్రగతికి రైతుబంధు నమూనాగా నిలిచిందన్నారు. ఈ పథకం అన్నదాతల్లో మనోైస్థెర్యాన్ని పెంచుతుంది అని అరవింద్ సుబ్రమణ్యన్ పేర్కొన్నారు.