మేడ్చల్ : జవహర్ నగర్లోని ప్రగతినగర్లో విషాదం నెలకొంది. సీఆర్పీఎఫ్ రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. లైసెన్సుడ్ తుపాకీతో కాల్చుకుని మాదగోని రాములు(55) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.