న్యూఢిల్లీ: 16 కిండర్ గార్టెన్ స్కూల్ యాజమాన్యం ఫీజు కట్టలేదన్న కారణంతో చిన్నారుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. కాగా ఇవాళ ఆ పాఠశాలను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సందర్శించారు. చిన్నారులను బంధించిన రేబియా పబ్లిక్ స్కూల్కు వెళ్లిన సీఎం కేజ్రీవాల్..విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఇలాంటి ఘటనలను ఢిల్లీ ప్రభుత్వం సహించదని రేబియా పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ నహీద్ఉస్మానిని సీఎం కేజ్రీవాల్ హెచ్చరించారు. ఈ ఘటనలో పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని, దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీవాల్తోపాటు మంత్రి ఇమ్రాన్ హుస్సేన్, పలువురు ఉన్నతాధికారులున్నారు.