కరీంనగర్ : ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. గురువారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో టీడీపీ నాయకులు మహాధర్నా చేపట్టి నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే హామీలను నెరవేర్చాలని, అర్హులైన లబ్ధిదారులకు పథకాలను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణతోపాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.