రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు దుబాయ్ వెళ్లేందుకు వచ్చిన మహిళ వద్ద ఈ విదేశీ కరెన్సీని గుర్తించారు. రూ. 25 లక్షల విలువైన సౌదీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.