నిజామాబాద్: భారీ మొత్తంలో చేస్తున్న గంజాయి అక్రమ రవాణాను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం దేవ్గర్ క్యాంప్ వద్ద చోటుచేసుకుంది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 150 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తున్నట్లుగా సమాచారం.