తిరుమల : మహబూబ్నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే, టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్.. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆయన స్వామి వారికి జరిగే అభిషేకం సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, ఎమ్మెల్యే కు స్వామివారి తీర్ధప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు. వెంకన్న స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.