శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకొని.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అచబాల్ చౌక్ వద్ద జరిగిన ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు గాయపడ్డారు. వీరిలో ఒకరు పౌరుడు ఉన్నాడు. మృతులను సబ్ ఇన్స్పెక్టర్ మీనా, కానిస్టేబుల్ సందీప్గా పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.