హైదరాబాద్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు బేగం పేట విమానాశ్రయానికి తరలి వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా ప్రసంగించకుండానే కత్రియా హోటల్ లో బస చేసిన ఆర్ఎస్ఎస్ పెద్దలతో అమిత్ షా భేటీ అయ్యారు. బేగం పేట వద్ద వేదికపై మాట్లాడకుండానే అమిత్ షా అక్కడ నుంచి నేరుగా కత్రియా హోటల్ కు చేరుకోవడంతో బీజేపీ కార్యకర్తలు నిరాశతో వెనుదిరిగారు.