సిరియాలోని డీర్ ఇజార్ నగరంపై జరిగిన వైమానిక దాడిలో 28 మంది పౌరులు మృతిచెందారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఉంటున్న స్థావరాలపై దాడులు జరిగాయి. ఇరాక్ బోర్డర్ సమీపంలో ఉన్న అల్ సౌసా గ్రామంలో ఉన్న ఐస్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న పౌరులపై వైమానిక దాడి జరిగినట్ల సిరియా అబ్జర్వేటరీ తెలిపింది. అయితే దాడులు చేసింది ఇరాకీ విమానమా లేక అమెరికా సంకీర్ణ దళాలా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఈస్ట్రన్ సిరియాలో ఇటీవల ఇరాకీ ప్లేన్లు దాడి చేశాయి.