ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మల్టీప్లెక్స్‌కు ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్లవచ్చు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 13, 2018, 04:11 PM

ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లకు వెళ్లేవాళ్లు తమ వెంట ఆహార పదార్ధాలను తీసుకుని వెళ్లవచ్చు అని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఒకవేళ సినిమా థియేటర్లు ఈ రూల్‌ను పాటించని పక్షంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపైన కూడా ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించాలని భావిస్తున్నది. ఈ విషయాన్ని ఆహారశాఖ మంత్రి రవీంద్ర చావన్ తెలిపారు. ఫుడ్ ఐటమ్స్‌తో సినిమాకు వెళ్తున్నవారిని ఎవరైనా అడ్డుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో ఆహార పదార్థాలను అధిక ధరలకు అమ్ముతున్నారు. దీనికి వ్యతిరేకంగా మహారాష్ట్ర నిరసనలు జరుగుతున్నాయి. ఇదే అంశంపై ఇటీవల పూణెలో ఎంఎన్‌ఎస్ కార్యకర్తలు ఓ థియేటర్ మేనేజర్‌ను చితక్కొట్టారు. ఒక ప్రాడక్టుకు వేర్వేరు రేట్లు ఉండకూడదని మంత్రి రవీంద్ర చావన్ ఇవాళ విధాన పరిషత్‌లో తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com