హైదరాబాద్: గత రెండుమూడు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో వర్షాలు రాష్ట్రమంతటా వ్యాపించాయి. ఈనెల 19 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇక.. ఒడిశా ఉత్తర తీర ప్రాంతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది.