హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఎంపీ కవిత కలిశారు. మంత్రి అధికారిక నివాసంలో కవిత ఆయనతో భేటీ అయ్యారు. నిజామాబాద్ జిల్లాలో హరితహారం, ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఈ భేటీలో చర్చించారు. ఈ సమీక్షలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.