దేశంలో చమురు ధరలు వరుసగా మూడో రోజు పెరిగాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు స్వల్పంగా పెరగడంతో దేశీయ ఆయిల్ కంపెనీలు ధరల్లో మార్పులు చేశాయి. శనివారం దేశవ్యాప్తంగా పలు నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర 19-20 పైసలు, డీజిల్ ధర 18-19 పైసలు పెరిగింది. నేటి ఉదయం 6 గంటల నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ధరల ప్రకారం.. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 76.95గా ఉంది. ఇక ముంబయిలో రూ. 84.33, చెన్నైలో రూ. 79.87, కోల్కతాలో రూ. 79.61గా ఉంది. లీటర్ డీజిల్ ధర దిల్లీలో రూ. 68.61, ముంబయిలో రూ. 72.80, చెన్నైలో రూ. 72.43, కోల్కతాలో రూ. 71.16గా ఉంది.