హైదరాబాద్: గచ్చిబౌలిలో జీహెచ్ఎంసీ స్వచ్ఛ్ ఇంటర్న్షిప్ కార్యక్రమం జరుగుతోంది. బ్రహ్మకుమారి సరోవర్ ఆడిటోరియంలో జరుగుతున్న కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, స్వచ్ఛ ఇంటర్నషిప్ కోసం ఐటీ ఉద్యోగులు, కళాశాల విద్యార్థులు హాజరయ్యారు. యువతకు స్వచ్ఛ కార్యక్రమంల్లో శిక్షణ ఇచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. దేశంలోనే మొదటిసారిగా జీహెచ్ఎంసీ ఇంటర్న్షిప్ నిర్వహిస్తోంది.