ఫిన్ల్యాండ్: అండర్-20 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ 400 మీటర్ల ఈవెంట్లో స్వర్ణ పతకం గెలుచుకున్న హిమదాస్.. ఆ మెడల్ను అందుకున్న సమయంలో భావోద్వేగానికి లోనైంది. మెడల్ సెర్మనీ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో హిమదాస్ ఆనందభాష్పాలను రాల్చింది. జనగణమన వల్లిస్తూనే ఆమె కన్నీరును ఆపుకోలేకపోయింది. మహాంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహాంద్రా ఆ వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేవారు. ఇది మిమ్మల్ని కదిలించకపోతే, ఇక ఏదీ మిమ్మల్ని కదిలించలేదని ఆయన తన ట్యాగ్లైన్లో పేర్కొన్నారు. ప్రపంచ అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్గా హిమదాస్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.