జయశంకర్ భూపాలపల్లి: తాడ్వాయి మండలం కొండపర్తి వద్ద రోడ్డు ప్రమాదం. అదుపుతప్పిన కారు ఓ గుట్టను ఢీకొట్టింది. మద్యం మత్తులో ఉండటమే ఇందుకు కారణంగా సమాచారం. ఈ దుర్ఘటనలో ముగ్గురుకి తీవ్రగాయాలు కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.