భద్రాద్రికొత్తగూడెం: ఎదురుకాల్పుల్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఈ ఘటన చత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో చోటుచేసుకుంది. చత్తీస్గఢ్ రాష్ట్రం కాకంకేర్ జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతాపపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహ్లా అటవీ ప్రాంతంలో భద్రత బలగాలకు తారసపడ్డ మావోయిస్టులు వారిపై ఎదురు దాడికి దిగారు. ఇరువర్గాల మధ్య సుమారు 45 నిమిషాల పాటు ఎదురు కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందగా, ఒక జవానుకి గాయాలైనట్లు తెలుస్తోంది. కాల్పుల ఘటనను కాంకేర్ ఎస్పీ కే.ఎల్ ధృవ్ స్పష్టీకరించారు.