నిజామాబాద్ జిల్లాలో ఎంపీ కవిత విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎంపీ కవిత జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో ఉచిత భోజన సేవలను ఎంపీ కవిత, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో పాఠకులు, విద్యార్థులకు భోజనం వడ్డించారు. అనంతరం ఎంపీ కవిత ఖలీల్వాడీ ప్రాంతంలో మహిళలతో కలిసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.