తెలంగాణలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లో బోనాల జాతర సందడి నెలకొంది. గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. జగదాంబిక అమ్మవారికి ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పించనుంది. లంగర్హౌస్లో ఏర్పాటు చేసిన తొట్టెలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. లంగర్హౌస్ నుంచి గోల్కొండ వరకు తొట్టెల ఊరేగింపు కొనసాగుతోంది. పోతరాజుల వీరంగాలతో ఊరేగింపు కొనసాగుతోంది. తొట్టెల ఊరేగింపు లంగర్హౌస్, చెరువుకట్ట, ఫతేదర్వాజా, బడాబజార్,చోటాబజార్ల మీదుగా కోటపైకి చేరుకోనుంది. గోల్కొండ ఆలయానికి వెళ్లే మెట్లను పసుపు, కుంకుమలతో భక్తులు అలరించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా గోల్కొండ కోట, ఆలయం వద్ద పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.