హైదరాబాద్: హైదరాబాద్లో బోనాల జాతర సందడి ప్రారంభమైంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. గోల్కొండలోని అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారు బోనం సమర్పించడానికి మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాస్యాదవ్, ఇంద్రకరణ్రెడ్డిలు లంగర్హౌస్ నుంచి బయల్దేరారు.