హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని గోల్కొండ కోటపై బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రులు పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లు జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. గోల్కొండ లో బోనాల సందడి నెలకొంది. అమ్మవారికి పెద్ద ఎత్తున మహిళలు బోనాలు సమర్పిస్తున్నారు.