జైపూర్ : రాజస్థాన్లో పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష రెండు రోజులపాటు నిర్వహించామని, ఆఖరు రోజున 7 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారని అడిషనల్ డిజిపి రాజీవ్ శర్మ చెప్పారు. కొంతమంది అభ్యర్థుల పేరుమీద ఇతరులు పరీక్ష రాయడానికి హాజరయ్యారని, వారిని పట్టుకున్నామని రాజీశ్ శర్మ చెప్పారు. ఎలాంటి సమస్యలు లేకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని శర్మ చెప్పారు. పరీక్ష సందర్భంగా జోధ్పూర్, జైపూర్, ఉదయ్పూర్లలో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను సాయంత్రం 5 గంటల వరకూ నిలిపివేశారు.