నల్గొండ : కాంగ్రెస్ నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని టిఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు అజ్ఞానుల్లా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఒక కుటుంబం పార్టీలా తయారైందని, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కాంగ్రెస్కు లేదన్నారు.