రాజన్న సిరిసిల్ల : తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా మండేపల్లిలో నిర్మించిన ఐటీఐ కళాశాల భవనాన్ని మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కరీంనగర్ జడ్పీచైర్పర్సన్ తుల ఉమతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ ఐటీఐ భవనాన్ని రూ. 7.74 కోట్లతో నిర్మించారు.