ముంబై : ముంబైలో రోడ్లపై గుంతల కారణంగా పలు ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉండటం, ఆ ప్రమాదాల్లో కొందరు మృతి చెందడంపై ఎంఎన్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పిడబ్ల్యుడి) కార్యాలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. కుర్చీలను విరగ్గొట్టారు. కొన్ని బల్లలు, స్టూళ్లు కిటికీల్లోంచి బైటికి పారేశారు. వెంటనే రోడ్లను మరమ్మతు చేయాలని వారు డిమాండ్ చేశారు.