పాట్నా : బీహార్కు ప్రత్యేక హోదా అంశాన్ని 15వ ఫైనాన్స్ కమిషన్కు నివేదిస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చెప్పారు. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని 2006నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన అన్నారు. బీహార్కు ప్రత్యేక హోదా అవసరం లేదని 14వ ఫైనాన్స్ కమిషన్ చెప్పిందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా సాధించడానికి తాము కృషి చేస్తున్నామని, 15వ ఫైనాన్స్ కమిషన్కు ఈ అంశాన్ని నివేదిస్తామని ఆయన అన్నారు.