ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలు కరువు : సురేష్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 16, 2018, 04:32 PM

పెద్దపల్లిరూరల్‌ జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలు కరువయ్యాయని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు గొట్టిముక్కుల సురేష్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. ఆస్పత్రి ఆవరణలో పారిశుధ్యం, వార్డుల్లో రోగులకు అందుతున్న మౌలిక సదుపాయాలను అక్కడివారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వార్డుల్లో రోగులకు తాగునీటి సౌకర్యం సరిగాలేదని తెలిపారు. ఫ్యాన్‌ల సౌకర్యం లేక దోమలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అన్ని విభాగాలకు చెందిన ప్రత్యేక వైద్యులు లేక పోవడంతో జనరల్‌ సర్జన్లతోనే రోగులకు సేవలందిస్తున్నారని మండిపడ్డారు. ఆస్పత్రిలోని వార్డుల్లో శానిటేషన్‌, ఇతర సౌకర్యాలను పూర్తిస్థాయిలో మెరుగు పర్చాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలను మెరుగు పరిచి నిబంధనల మేరకు వైద్య ఖాళీలను భర్తీ చేయాలని, లేకుంటే తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూషనవేన రమేష్‌గౌడ్‌, మంథని నర్సింగ్‌, సర్వర్‌పాషా, కావేటి రాజగోపాల్‌, బండి అనిల్‌, అస్లాంతోపాటు పలువురు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com