పెద్దపల్లిరూరల్ : దున్నేవారికే ప్రభుత్వ భూముల పట్టాలు ఇవ్వాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడిపల్లి బాపయ్య డిమాండ్ చేశారు. మండలంలోని కుర్మపల్లికి చెందిన గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం జేసీ వనజాదేవికి వినతిపత్రం సమర్పించారు. సర్వే నం.301లో ప్రభుత్వ భూమిని 40 ఏళ్లుగా సాగు చేసుకొని జీవిస్తున్న వారికే అట్టి భూములకు సంబంధించిన నూతన పట్టాదారు పాస్పుస్తకాలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. బహుజన లిబరేషన్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎరవెల్లి ముత్యంరావు, జ్యోతి, మామిడిపల్లి తిరుపతితోపాటు పలువురు పాల్గొన్నారు.