పెద్దపల్లిరూరల్: ప్రస్తుత సర్పంచ్ల పదవీకాలం ఆగస్టు 1న ముగియనున్నందున ప్రస్తుత సర్పంచ్లకే పర్సన్ ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించాలని ఉమ్మడి జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్, జడ్పీటీసీ యాట దివ్యరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జేసీ వనజాదేవికి సోమవారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధితోపాటు ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలులో కీలకపాత్ర పోషించిన సర్పంచ్లకు బదులుగా ప్రత్యేకాధికారులను నియమిస్తే గ్రామపరిపాలన కుంటు పడుతుందని అభిప్రాయపడ్డారు. హరితహారం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాల విజయవంతంలో సర్పంచ్ల పాత్ర ఎంతో కీలకం అని, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకాధికారుల పాలనను విరమించుకొని ప్రస్తుత సర్పంచ్లనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు కొంతం సత్యం, సూర సమ్మయ్య, పడాల పర్శరాములుగౌడ్, మందల రమాదేవి, చంద శంకర్తోపాటు పలువురు పాల్గొన్నారు.