ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దురుద్దేశ్యంతోనే ఎపి హైకోర్టును నిర్మించలేదని టిఆర్ఎస్ ఎంపి వివేక్ ఆరోపించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొంటూ చంద్రబాబుపై పలుమార్లు విమర్శలు చేశారు. ఎపిలో సచివాలయం, శాసనసభ భవనాలను రికార్డు సమయంలో నిర్మించుకున్న ఎపి ప్రభుత్వం హైకోర్టును నిర్మించుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తోందని, దురుద్దేశ్యాలతోనే హైకోర్టును నిర్మించడం లేదని వివేక్ అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఇరు రాష్ట్రాలకు ఉన్న హైకోర్టులో న్యాయమూర్తుల్లో తెలంగాణ ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందని ఆయన చెప్పారు.