ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతి విశ్వాసం ఎప్పుడూ మంచిది కాదు : రాజ్‌నాథ్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 20, 2018, 04:16 PM

లోక్‌సభ : అతి విశ్వాసం ఎప్పుడూ మంచిది కాదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. అవిశ్వాసంపై జరిగిన చర్చలో రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ కాలం మారినా, ఎంతపెద్దవారైనా అహంకారం పనికిరాదని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు బలవంతంగా ఏకమయ్యాయని ఆయన అన్నారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టిన పార్టీలకు ఒకరిపై మరొకరికి విశ్వాసం లేదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో అవిశ్వాసం పార్టీల హక్కు అని ఆయన చెప్పారు. యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమనే కారణంగా తాము అవిశ్వాసం ప్రవేశపెట్టలేదని ఆయన అన్నారు.ఎన్‌డిఎ ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఉందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ అన్నారు. ఒకప్పుడు ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్న బిజెపి ఇప్పుడు అధికారంలో ఉందని ఆయన చెప్పారు. 30 ఏళ్ల తరువాత పూర్తి మెజారిటీతో ఏర్పడిన ప్రభుత్వం తమదని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమ పార్టీ సత్తా చాటుకుంటోందని ఆయన చెప్పారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com