వరంగల్ అర్బన్ : నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రా యూనివర్సిటీతో పాటు దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను ఈ ముఠా తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముఠా సభ్యుల నుంచి 2 ల్యాప్టాప్లు, 3 కలర్ ప్రింటర్స్, ట్యాబ్, ఐప్యాడ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులంతా ఇతర రాష్ర్టాలకు చెందిన వారు. ముఠా సభ్యులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.