ఛత్తీస్గఢ్లోని కోర్బాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కేంద్రీయ విద్యాలయ విద్యార్థులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. 30 ఫీట్ల ఎత్తులో ఉన్న బ్రిడ్జిపై నుంచి వాహనం కింద పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 15 మంది విద్యార్థులున్నారు. వీరిలో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డ విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వాహనం డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.