డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నేటి నుంచి జులై 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆ రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ నెల 22న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొండల పక్కన రోడ్లపై వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడిన విషయం విదితమే.