హరితహారంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మంత్రి కేటీఆర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను వెటరన్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్వీకరించారు. హైదరాబాద్ లో దానిమ్మ, వాటర్ యాపిల్, లక్ష్మణ ఫలం మొక్కలు నాటారు. ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, మహిళా క్రికెటర్ మిథాలి రాజ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకి గ్రీన్ ఛాలెంజ్ చేశారు. ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటాలని సూచించారు. హరితహారంను విజయవంతం చేయాలని కోరారు.