ఉత్తర ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా యమునా నది ఉగ్రరూపం దాల్చింది. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిని మించి యమునా నది ప్రవాహం కొనసాగుతోంది. అటు హర్యానాలో హత్నీకుండ్ ప్రాజెక్ట్ నుంచి దాదాపు 4 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో నది ప్రవాహం మరింత ఉధృతమైంది. ఢిల్లీ వాసులకు వరద ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నది పరివాహక ప్రాంతాలు సహా లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎన్.డి.ఆర్.ఎఫ్ సహా ఢిల్లీ నగర పాలక సిబ్బందిని సిద్ధంగా ఉంచారు.