ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 06, 2018, 10:13 AM

హైదరాబాద్: ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చుక్కాని.. తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి చాటిన మహాజ్ఞాని.. తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత.. ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఎంపీ కవిత జయశంకర్‌కు ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ట్విట్టర్‌లో ఆయనకు నివాళులు అర్పిస్తూ కవిత ట్వీట్ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి మంత్రి జోగు రామన్న నివాళులర్పించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com